పల్లేటూరిలో పుట్టిపెరిగిన ఒక అమ్మాయి.. పట్నoలో చదువుకుని.. మంచి ఉద్యోగం సంపాదించింది.. ఫారెన్ వెళ్ళే చాన్స్ వచ్చింది.. వెళ్ళింది.. 5 సంవత్సరాలు ఫారెన్ లో ఉన్న తరువాత.. తన తల్లిదండ్రులను చూద్దాం అని తన పల్లెటూరికి వెళ్ళింది.. అమ్మాయి తండ్రి అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తున్నాడు.. అమ్మాయి మధ్యలో బైక్ ఆపమని చెప్పి.. డాడీ డాడీ.. పొలం ఉన్నవి ఏ చెట్లు అని అడిగింది.. తన తండ్రి.. అవి వరి చెట్లు తల్లి.. అని చెప్పాడు.. అందుకు ఆ అమ్మాయి.. దట్టా...!! బియ్యం కాసేది ఆ చెట్లకే కదా.. అని అడిగింది.. ఓళ్ళు మండిన అమ్మాయి తండ్రి.. నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడేనే.. పొలంలో ఏ చెట్లు వేస్తారరో.. వాటికి ఏం కాస్తాయో తెలియదా.. ఫారెన్ కి వెళ్ళినంత మాత్రానా బాష మారి.. బుర్ర కూడా మారుతుందా.. కళ్ళు నెత్తికి ఎక్కినయా ఎంటి..?? అని చీవాట్లు పెట్టే సరికి.. పూర్వ జ్ఞానం గుర్తుకోచ్చేసింది అమ్మాయి గారికి.. మనం కూడా ఇలాంటి బాపతి మనుషుల్ని చూస్తుంటాం... నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుని సంపాదనలో పడితే.. పాత జ్ఞాపకాలు.. మనుషుల పట్ల విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.. వెర్రి వేయ్యి విదాలు అని.. ఇలాంటి వాళ్ళకి వెర్రి బుర్ర నిండా ఉంటది.. ఎంటో విచిత్ర జీవులు.. ఎలా బ్రతుకుతారో ఎంటో.. o.O -vEnkY
Posted on: Sun, 06 Oct 2013 16:43:58 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015