దిగ్విజయ్ ని సీబీఐ డైరెక్టర్ ఎందుకు కలిశారో చెప్పాలి : బాబు ఏ కేసులో నిందుతుడు, కనీసం సాక్షి కాని దిగ్విజయ్ సింగ్ ని సీబీఐ డైరెక్టర్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాట్లాడుతూ .. సీబీఐ డైరెక్టర్ స్థాయి వ్యక్తి వచ్చి కలవడానికి దిగ్విజయ్ ఏమన్నా సీబీఐ కి యజమానా? అని నిలదీశారు. పత్యర్థులను లొంగదీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. దొంగలు, అవినీతి పరులకు సీబీఐ అండగా నిలబడుతోందని ఆయన విమర్శించారు.
Posted on: Thu, 03 Oct 2013 13:12:26 +0000