ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ ప్రవేశ పరీక్ష Updated : 5/22/2014 5:38:39 PM హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ -2014 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 523 కేంద్రాల్లో, అగ్రికల్చర్ - మెడిసిన్ ప్రవేశ పరీక్ష 227 కేంద్రాల్లో పరీక్షా నిర్వహణ జరిగింది. ఇంజినీరింగ్ పరీక్షకు 94.37 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు క్యూ కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేయగా, మెడిసిన్ - అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షకు ఆర్ కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆలస్యం కావడంతో పలు చోట్ల కొంత మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. నిబంధనల ప్రకారం ఆలస్యమైన చోట్ల విద్యార్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోని విద్యార్థులు కంటతడి పెట్టారు. #NANI Like ✔ and Share ✔ our Greater Karimnagar Visit our Website: greaterkarimnagar/ Regards Greater Karimnagar Team
Posted on: Thu, 22 May 2014 13:05:02 +0000